logo

header-ad
header-ad

30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్‌ క్లోజ్‌

ముంబై :  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్‌ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది.  దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ ఇటీవల  లాంచ్‌ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది.  ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే  సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు  మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించింది. దీంతో  ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్‌ఎస్‌ అందించిన  నివేదిక ప్రకారం, ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం.  అక్టోబర్ 20న  ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి.

Source: https://www.sakshi.com/news/business/record-sale-samsung-galaxy-fold-phones-sold-30-mins-india-1230133

Leave Your Comment