logo

header-ad
header-ad

అమెరికాకు షాక్ : ఐసిస్ దాడిలో 53 మంది సైనికులు మృతి

ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైనికులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని ఐసిస్ కూడా ధృవీకరించింది.  ఐసిస్ చీఫ్ చనిపోయినట్టుగా పేర్కొంది.  ఐసిస్ చీఫ్ లేకపోవడంతో ఆ సంస్థ బలహీనపడిందని, అందరూ అనుకున్నారు.  కానీ, అమెరికా దాడిలో ఐసిస్ చీఫ్ మరణించిన కొన్ని రోజులకే మాలిలో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  

మాలిలో ఆర్మీపోస్టులను లక్ష్యంగా చేసుకొని తెగబడ్డారు.  ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 53 మంది  ఆర్మీ జవానులు మరణించారు.  ఈ దాడి చేసింది తామే అని ఐసిస్ ప్రకటించడంతో అమెరికా షాక్ అయ్యింది.  బలహీనపడుతుంది అనుకున్న ఐసిస్, ఇలా షాక్ ఇవ్వడంతో అమెరికాతో సహా ఆ ఉగ్రవాద సంస్థతో పోరాటం చేస్తున్న దేశాలు షాక్ అయ్యాయి.  

Source: https://www.ntvtelugu.com/post/isis-shock-to-usa

Leave Your Comment