logo

header-ad
header-ad

చైనాలో భారత్‌ సినిమా రికార్డు!

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా చైనాలో రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను సెప్టెంబరు 6న అక్కడ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై చిత్రం విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి విదేశీ చిత్రం ‘2.ఓ’ అని తెలిపింది.

లైకా ప్రొడక్షన్స్‌.. హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి సినిమాను చైనాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. నిజానికి జులై 12న ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ ఇదే సమయంలో హాలీవుడ్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల కాబోతుండటంతో ‘2.ఓ’ను వాయిదా వేశారట. 47 వేల కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న ఈ ఇండియన్‌ భారీ బడ్జెట్‌ చిత్రం చైనాలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు విమర్శకులు అంచనా వేస్తున్నారు. ‘రోబో’కు సీక్వెల్‌గా తీసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయికగా కనిపించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది నవంబరులో విడుదలై రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం.

Source: https://www.eenadu.net/cinema/morenews/9/2019/08/13/141403/2-Point-0-film-to-release-in-China-on-Sep-6th

Leave Your Comment

  • hari Aug 19, 2019 10:59 AM
    Great achievement.. All th best ROBO 2.O